నా ఆస్తులు రూ.416 కోట్లు... నాపై ఉన్న కేసులు 4... జగన్

గురువారం, 17 ఏప్రియల్ 2014 (19:39 IST)
WD
ఎన్నికలు 2014లో పోటీ చేసేందుకుగాను ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గురువారం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జగన్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలను కూడా పేర్కొన్నారు. తనపై 10 సీబీఐ అభియోగాలు, ఈడీ కేసుతో పాటు మరో 3 కేసులు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా తన ఆస్తులు రూ. 416 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు.

ఈ 416 కోట్ల రూపాయల ఆస్తుల్లో రూ. 344 కోట్లు తన పేరుపై ఉండగా మిగిలినవి అంటే, రూ. 72 కోట్లు తన భార్య భారతి పేరుపై ఉన్నాయని తెలిపారు. తనకు కనీసం సొంత వాహనం లేదని తెలిపారు. ఐకే 2011 ఉపఎన్నికల సందర్భంగా తన ఆస్తులను రూ. 445 కోట్లుగా చూపించిన జగన్ ఇప్పుడు తన ఆస్తులు రూ. 416 కోట్లుగా ఉన్నట్లు చూపించడంతో ఆయన ఆస్తి కొంతమేర కరిగిపోయిందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి