వధూవరుల కల్యాణ మహోత్సవాన్ని మనం తిలకిస్తుంటాం. ఇది సహజం కూడానూ.. అయితే ఇద్దరు స్నేహితులు తమ స్నేహం విడిపోకూడదంటూ... వివాహబంధంతో ముడివడటాన్ని ఎక్కడైనా చూశారా...? విదేశాల సంగతి ఎలా ఉన్నా.... బహుశా.. ఇప్పటివరకూ మన తెలుగునాట జరిగి ఉండకపోవచ్చు.
గత చరిత్ర సంగతి ఎలా ఉన్నా... తాజాగా ఇద్దరు స్నేహితులు తమ స్నేహాన్ని వివాహబంధంతో ముడివేసుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణ, నాగరాజు ఇద్దరూ బాల్య స్నేహితులు. తమ స్నేహాన్ని వివాహబంధంతో ముడివేసుకోవాలని కరీంనగర్ జిల్లా వేమూలవాడకు వెళ్లి ఓ దేవాలయంలో పెళ్లి కానించేశాకు. ఇది తెలుసుకున్న జనం ముక్కునవేలేసుకున్నారు.