కుదరని సయోధ్య: వైఎస్.వివేకానంద రాజకీయ సన్యాసం!?

ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి మళ్లీ మాట మార్చారు. మంగళవారం ఇడుపులపాయలో వైఎస్.జగన్-వైఎస్.వివేకాల మధ్య ముఖాముఖి భేటీ జరిగింది. కేవలం రెండు మూడు సమావేశాలు మాత్రమే ఈ భేటీ జరిగింది. ఇందులో సుదీర్ఘ చర్చ జరుగలేదు. పైపెచ్చు... జగన్‌-వివేకాల మధ్య సయోధ్య కుదరలేదన్నది సమాచారం. దీంతో సమావేశం నుంచి వివేకా విసురుగా లేచి అర్థాంతరంగా వెళ్లి పోయారు.

పోతూపోతూ.. అధిష్టానానికి, కుటుంబానికి మధ్య నలిగి పోతున్నాననీ, ఎవరికీ న్యాయం చేయలేక పోతున్నానంటూ ఆయన వాపోయారు. పైపెచ్చు.. రాజకీయ సన్యాయం తీసుకుంటానని జగన్‌తో చెప్పినట్టు వినికిడి. ఇదే అంశంపై మధ్యాహ్నం 11.30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్.కుటుంబ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

వెబ్దునియా పై చదవండి