వైఎస్ ఇచ్చిన టిక్కెట్‌పై గెలిచా.. ఎందుకు రాజీనామా చేయాలి

దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన టిక్కెట్టుతోనే తను 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాననీ, అది వైఎస్ భిక్ష తప్ప మరెవరి భిక్ష కాదనీ, కనుక తను రాజీనామా చేయనవసరం లేదని మాజీమంత్రి కొండా సురేఖ అన్నారు.

రాజకీయాలనైనా వదులుకుంటాం కానీ మంత్రిపదవులకోసం కొంతమంది ఢిల్లీ చుట్టూ తిరిగినట్లు తాము తిరిగబోమని వైఎస్ వివేకానంద రెడ్డిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

వచ్చే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందనీ, పార్టీకి కనీసం 26 స్థానాలు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పై ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో ఆ పార్టీ ఉండటం చర్చనీయాంశమైంది. ఈ విపత్కర పరిస్థితులను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి