పార్లమెంట్‌లో బిల్లుపెడితేనే రాష్ట్ర ఏర్పాటు: విద్యాసాగర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటులో రెండు అంశాలు మాత్రమే ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయన్నారు.

వీటిలో ఒకటి అందులో ఇకటి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కాగా, మరొకటి తెలంగాణ బిల్లు ఎప్పుడు పెట్టబోతున్నారనే అంశమేనన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు కోసం సుష్మాస్వరాజ్ ఎదురుచూస్తున్నారన్నారు. ఈ బిల్లు పెట్టేంత వరకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. తెలంగాణలోని అట్టడుగు వర్గాల ప్రజలలో తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉందన్నారు. అందువల్ల బిల్లు పెట్టి రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి