ఇంటర్ సెకండియర్ ఫలితాలు : మే 22న సిప్లమెంటరీ పరీక్షలు

శుక్రవారం, 26 ఏప్రియల్ 2013 (19:03 IST)
File
FILE
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి కె.పార్థసారథి తెలిపారు. పరీక్షకు హాజరుకాగోరే విద్యార్థులు మే 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆ తర్వాత అపరాద రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తామని చెప్పారు.

కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఆయన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లో విడుదల చేసిన విషయం తెల్సిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థుల కోసం ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు మార్కుల రీకౌంటింగ్, దిద్దిన సమాధాన పత్రాల జిరాక్స్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రీకౌంటింగ్ కోసం రూ.100, అన్సర్‌బుక్ రీవెరిఫికేషన్, జిరాక్స్ కోసం రూ.600 రూపాయలు రుసుము చెల్లించి పొందవచ్చని తెలిపారు.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెబ్దునియా పై చదవండి