వీహెచ్: విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది వైఎస్సారే!

FILE
రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది వైఎస్సేనని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు చెప్పారు. 2000 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి విభజన కోరింది వైఎస్సేనని వీహెచ్ అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు.

తిరుమలకు వెళ్లిన తాను అలిపిరి వద్దకు చేరుకోగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గులాబీ పూలు ఇచ్చేందుకు వచ్చారని, అదే సమయంలో వెనుకనుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి ఉపక్రమించారని వీహెచ్ వెల్లడించారు.

రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని, అన్నదమ్ముల్లా కలిసుందామని వీహెచ్ సూచించారు. తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదని, 60 ఏళ్ళ నాటిదని చెప్పుకొచ్చారు. అసలు తెలంగాణ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించిందే రాయలసీమ నేతలని వీహెచ్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి