హైటెక్స్‌లో వైభవంగా బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహం!

బుధవారం, 21 ఆగస్టు 2013 (09:50 IST)
File
FILE
సినీనటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఎం. శ్రీభరత్‌తో బుధవారం ఉదయం 8.52 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ సిటీలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వరుడు శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి