కాటసాని రామిరెడ్డి : కాంగ్రెస్‌‌కు గుడ్‌బై .. వైకాపా గూటికి

సోమవారం, 26 ఆగస్టు 2013 (11:05 IST)
File
FILE
బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత పార్టీ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో ఆయన కడప ఎంపీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు.

మరోవైపు తన నియోజకవర్గంలో ఆయన ఆమరణనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ అధిష్టానం నియంతలా వ్యవహరిస్తోందని ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని ఆయన హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి