ఏపీఎన్జీవోల సమ్మె : కౌంటర్‌కు టైమ్ కావాలి.. 2కు వాయిదా!

సోమవారం, 26 ఆగస్టు 2013 (14:04 IST)
File
FILE
ఏపీఎన్జీవోల సమ్మెను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సెప్టెంబర్ 2వ తేదీకి రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలంటూ ఏపీఎన్జీవోలు కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ప్రతి పౌరుడూ తమ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని హితవు పలికిన హైకోర్టు, గడువులోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్జీవోలకు హెచ్చరించింది. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధుడై ఉండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సమ్మె చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేదానినే పరిశీలనలోకి తీసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేసమయంలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి వెల్లడించాలని హైకోర్టు కోరింది.

వెబ్దునియా పై చదవండి