జగన్ దీక్ష ఎఫెక్ట్ : కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:48 IST)
File
FILE
సమ న్యాయం పేరుతో చంచల్‌గూడ జైలులో నిరవధిక దీక్షకు జగన్ మోహన్ రెడ్డి దీక్షకు దిగడంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు ఏకంగా పార్టీనే వీడుతున్నారు.

తాజాగా, అనంతపురం జిల్లా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పారు. వీరిలో కేతిరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. కాటసాని కూడా జగన్ దీక్షకు మద్దతు ప్రకటించారు.

హైదరాబాద్‌లో వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాటసాని కూడా త్వరలోనే వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి