టీఆర్ఎస్ నేతల ఢిల్లీ టూర్ : సీమాంధ్రులు రెచ్చగొడుతున్నారు

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:19 IST)
File
FILE
టీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయానికి ఇకపై తిరుగులేదన్నారు. అయితే, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు, ఉద్యోగస్తులు, ప్రజా ప్రతినిధులు తమను రెచ్చగొడుతున్నారంటూ వారు ఆరోపించారు. అందుకే ఢిల్లీకి వెళుతున్నట్టు చెప్పారు.

కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యాంధ్ర నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా హస్తిన బాట పట్టడం గమనార్హం. ఆ పార్టీ నేతలు హరీష్ రావు, గంగుల కమలాకర్, విద్యాసాగర్ రావు మంగళవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమపైనే దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వాటిని సీడీల రూపంలో కేంద్రానికి, ప్రతిపక్షాలకు వివరిస్తామని హరీష్ రావు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి