చంద్రబాబు మాత్రం ఇంట్లో దాక్కున్నాడు : భూమా నాగిరెడ్డి

FILE
సమైక్యాంధ్ర కోసం చిన్నారులు, వృద్ధులు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంట్లో దాక్కున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి విమర్శించారు.

దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దీక్షలు చేస్తున్న తెలుగుదేశం నేతలు ముందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిముందు దీక్ష చేయాలని వైఎస్సీర్సీపీ నేత భూమా నాగిరెడ్డి సూచించారు.

వెబ్దునియా పై చదవండి