జగన్ హెల్త్ బులెటిన్ విడుదల : బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్!

FILE
విభజనతో సమ న్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చంచల్ గూడ జైల్లో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హెల్త్ బులెటిన్‌ను జైలు అధికారులు విడుదల చేశారు.

జైలు అధికారులు జగన్‌కు సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు జైలు అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బులెటిన్ విడుదల చేశారు. జైలు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.

బిపి, షుగర్ లెవల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయన్నారు. కాగా, జగన్ దీక్ష జైలులో మూడో రోజుకు చేరుకుంది. జగన్ ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి తన దీక్షను ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి