జగన్ దీక్ష వెనుక ఏం జరుగుతుందో తెలీదు: బొత్స కామెంట్

FILE
జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేపట్టిన దీక్ష వెనుక లోపాయికారిగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో వైకాపా నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారే మళ్లీ ఆపార్టీలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి, కాంగ్రెస్ నుంచి వలసలకు ఎలాంటి సంబంధం లేదని బొత్స అన్నారు. పేదల కోసమే ఆహార భద్రతా బిల్లును తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బొత్స వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి