సీపీఎం నేతలది పచ్చి అవకాశవాదం: నారాయణ

FILE
సీపీఎం నేతలు పచ్చి అవకాశవాదంతో సీపీఐపై మాటలు తూలుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. సీపీఎంపైనా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులుపైనా మండిపడ్డ నారాయణ, సమైక్యాంధ్రకు తామొక్కళ్లమే మొనగాళ్లు కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో సన్నాయి నొక్కులు, కోస్తాంధ్రలో సింహగర్జనలు చేసే సీపీఎం గురించి పార్టీలు, ప్రజలు తెలుసుకుంటారని నారాయణ చెప్పారు. అన్ని పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాతే తెలంగాణకు మద్దతు పలికినట్టు వివరించారు.

వెబ్దునియా పై చదవండి