కిషన్ రెడ్డి : బీజేపీ - టీఆర్ఎస్ పొత్తు ఉండొచ్చు!

శుక్రవారం, 13 డిశెంబరు 2013 (16:06 IST)
File
FILE
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (బీజేపీ - టీఆర్ఎస్) పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సూచన ప్రాయంగా వెల్లడించారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి వుందని ఆయన మరోమారు స్పష్టం చేశారు.

ఇదే అంశంపై కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెరాసతో పాత్తును కొట్టిపారేయలేమన్నారు. అవినీతి పరుడైన వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డితో బీజేపీ పొత్తు పెట్టుకునేది లేదన్నారు. అయితే విభజన పూర్తయ్యాక మాత్రమే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి