తెలంగాణాలో కాంగ్రెస్ ఓడిపోతే నాదే బాధ్యత : పొన్నాల

సోమవారం, 14 ఏప్రియల్ 2014 (18:05 IST)
File
FILE
వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పూర్తి బాధ్యత తనదేనని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తనదే బాధ్యత అని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి దళితులు వెళ్లిపోయారన్నారు. పోలవరం కాంట్రాక్టర్లతో మాట్లాడే పెద్దమనిషి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బాబ్లీ నిర్మాణానికి సహకరించిన వారికి టిక్కెట్లు ఇచ్చి బడుగులను కించపరిచే దురహంకారి కేసీఆర్ అని పొన్నాల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

వెబ్దునియా పై చదవండి