టీడీపీ తరపున విజయవాడ లోక్సభ టికెట్ను ఆశించి భంగపడిన పీవీపీ వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్ బుధవారం జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడ ఎంపీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇదే విషయంపై చర్చిస్తున్నట్టు సమాచారం.
విజయవాడ లోక్సభ స్థానం కోసం స్థానిక నేత కేశినేని నాని ముందు నుంచీ పోటీలో ఉన్నారు. టికెట్ కూడా ఆయనకే దాదాపుగా ఖరారైంది. అయితే, పొట్లూరి వరప్రసాద్కు టికెట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించడంతో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. కేశినేనిని శాసనసభకు పోటీ చేయాలని చంద్రబాబు సూచించినా ఆయన ఒప్పుకోకపోవడంతో విజయవాడ లోక్సభ టికెట్ ఆయనికివ్వక తప్పలేదు.
దీంతో తన పోరాటం, పవన్ సూచన ఫలించకపోవడంతో పొట్లూరి, ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన వర్గీయులు కొందరు మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్తో చర్చల తర్వాత పొట్లూరి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది.