ప్రచారానికి బొట్టుపెట్టి పిలవాల్సిన పనిలేదు : బాలకృష్ణ

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (14:29 IST)
File
FILE
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయాల్సిందిగా ఏ ఒక్కరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం లేదని సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేసినట్టేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తరపున తమ బాధ్యతగా టీడీపీ గెలుపు కోసం నందమూరి కుటుంబ సభ్యులందరూ కలసి ప్రచారం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ పై విధంగా సమాధానం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి