కేసీఆర్.. ఇక మూటముల్లె సర్దుకో : విజయశాంతి

గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:04 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు ఇక మూటముల్లె సర్దుకోవడం మంచిదని మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ మాజీ నేత, కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి విజయశాంతి సూచించారు. పదేళ్ళ క్రితం పుట్టిన టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందంటే ఎవరైనా నమ్ముతారా అని ఆమె ప్రశ్నించారు.

ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రాజకీయాల్లోంచి తప్పుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం కేసీఆర్ నైజమన్నారు.

అందువల్ల ఆయన రాజకీయాల్లోంచి రిటైర్ కావాలని సలహా ఇచ్చారు. మెదక్ ఎంపీగా ప్రజాసంక్షేమానికి తాను చేపట్టిన పనులను టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. వీధి దీపాలు, నీటి మోటార్లకు కేటాయించిన నిధులను నేతలు దుర్వినియోగం చేశారని ఆమె మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి