రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా మండపేట నుంచి నటి హేమ పోటీ

గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:50 IST)
WD
రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సినీ క్యారెక్టర్ ఆర్టిస్టు నటి హేమ తెలిపారు. రాష్ట్ర విభజన తీరుకు నిరసనగానే రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని చెప్పిన హేమ జై సమైక్యాంధ్ర పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.

కాగా జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి అమలాపురం ఎంపీ స్థానానికి హర్షకుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హర్షకుమార్ నామినేషన్ వేస్తున్నప్పుడు హేమ కూడా హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున తాను మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పారామె.

వెబ్దునియా పై చదవండి