సోనియా వచ్చినా తెలంగాణలో తలరాత మారదు : టీడీపీ

గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:51 IST)
File
FILE
తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం చేసినా ఆ ప్రాంత నేతల తలరాత మాత్రం మారదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 9 సీట్లకు మించి రావని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు జోస్యం చెప్పారు.

ఆయన గురువారం మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చామంటూ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను మండవ ఖండించారు. ఐదేళ్లపాటు ఇవ్వని తెలంగాణను ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో సోనియా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చుండేది కాదన్న సంగతి కాంగ్రెస్ గ్రహించాలని ఆయన హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఇకనైనా మానుకోవాలని, తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈసారి 9 సీట్లు కూడా రావని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి