టీడీపీతో పొత్తుపై అయోమయం లేదు: జవదేకర్ స్పష్టం!

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (09:20 IST)
FILE
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీలపై పొత్తు కుదకలేదని వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధికారి ప్రకాష్ జవదేకర్ స్పష్టతనిచ్చారు. నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూలును ఖారారు చేయడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. గురువారం రాత్రి ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు విషయంలో ఎలాంటి అయోమయం లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో మాట్లాడతామని, అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. శుక్రవారం ఉదయానికల్లా పొత్తుపై స్పష్టత వస్తుందని, పొత్తు రద్దయ్యే ప్రశ్నే రాదని, దీనిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదరకపోతే బీజేపీ అన్ని సీట్లకు పోటీచేయడానికి సిద్ధపడాలని కూడా బీజేపీ నాయకత్వం చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి