నా భార్య డబ్బులకు లెక్కలు చెప్తా... జగన్ పార్టీ నాయకుడు పార్థసారథి

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (14:08 IST)
FILE
తన భార్య నుంచి హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.45 లక్షలకు సంబంధించి తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం అభ్యర్థి కె.పార్థసారథి వెల్లడించారు. తన భార్యను నగదుతో అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై విజయవాడలో పార్థసారథి మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ అభ్యర్థి రూ. 70 లక్షల వరకూ ఖర్చు పెట్టవచ్చని ఉన్నదని తెలిపారు. ఎన్నికల ఖర్చు కోసమే కార్పొరేట్ బ్యాంక్ నుంచి ఆ నగదును తన సతీమణి డ్రా చేసుకుని వస్తున్నారని వివరించారు.

మాజీ మంత్రి పార్ధసారథి సతీమణి కమల రూ.45 లక్షల తరలిస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమె ఈ డబ్బును ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వదిలిపెట్టారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కమల ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీలు చేయగా ఈ నగదు లభ్యమైంది. కాగా మాజీమంత్రి పార్ధసారథి మచిలీపట్నం లోక్ సభ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిన విషయమే.

వెబ్దునియా పై చదవండి