బిజెపి తెలంగాణ మేనిఫెస్టో... సెప్టెంబరు 17 విమోచన దినం

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (14:57 IST)
FILE
ఎన్నికలు 2014 నేపధ్యంలో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శుక్రవారంనాడు బిజెపి కార్యాలయంలో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. మేనిఫెస్టే విడుదల సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించామని వివరించారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను వివరిస్తూ.... తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవడానికి కృషి చేస్తామని చెప్పారు. ఇంకా సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా ప్రకటిస్తామనీ, వరంగల్ లో అమరవీరుల స్మారక చిహ్మాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి