కేటీఆర్ కు కిడ్నీలో రాళ్లు... యశోదలో ఆపరేషన్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (15:40 IST)
FILE
తెలంగాణ ప్రాంతంలోని సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస నేత, కెసిఆర్ కుమారుడు కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తూ తీవ్రమైన కడునొప్పితో పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్ కు తొలుత సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి వెంటనే హైదరాబాద్‌కి తీసుకెళ్ళాల్సిందిగా సూచించారు. దాంతో కెటిఆర్ ను హైదరాబాదులోని యశోద ఆస్పత్రికి తరలించారు.

అక్కడ కేటీఆర్ ను పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. మరో రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి