ఏపీలో రూ.105 కోట్లు స్వాధీనం చేసుకున్నాం : సీఈసీ

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (11:06 IST)
File
FILE
దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 105 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు సీఈసీ సంపత్ వెల్లడించారు. అలాగే, ఏపీలో 25,300 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 1,142 అక్రమ నగదు తరలింపు కేసులు నమోదయ్యాయని, 29,290 మద్యం తరలింపు కేసులు నమోదయ్యాయని సీఈసీ సంపత్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్నీ పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఈవీఎంలే వాడుతున్నామన్నారు. ఈవీఎంలలో తలెత్తే సాంకేతిక లోపాలను అధిగమిస్తామన్నారు. కొన్ని చోట్ల ఒకే పార్టీకి ఓట్లు పడినట్టు ఫిర్యాదులు వచ్చాయని, ఆయా చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించామని ఆయన వివరించారు. నోటాకు గుర్తింపు చిహ్నం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి