రాష్ట్రంలో టీడీపీ - బీజేపీ కూటమిదే విజయం: ఆజ్‌తక్ సర్వే

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (16:00 IST)
File
FILE
రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీదే విజయమని ప్రముఖ హిందీ ఛానల్ ఆజ్‌తక్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఆ రెండు పార్టీలకు ఎంతగానో కలిసి వచ్చిందని ఈ సర్వే తేల్చింది.

ఇదే విషయాన్ని అనేక వరుస సర్వేలు వెల్లడిస్తున్నాయి కూడా. తాజాగా ప్రముఖ హిందీ ఛానల్ 'ఆజ్‌తక్' సిసిరోతో కలిసి నిర్వహించిన సర్వేలోనూ టీడీపీ-బీజేపీ కూటమి 17 నుంచి 21 ఎంపీ స్థానాలను గెలుచుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ రెండు పార్టీల పొత్తు కారణంగా సీమాంధ్ర-తెలంగాణలోనూ విజయభేరీ మోగించనున్నదని ఆజ్‌తక్ సర్వే వెల్లడిచేసింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలు, ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జాతీయ ఛానల్స్, సంస్థలు, రాష్ట్ర విభజన, రాజకీయ ఎన్నికల పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

సీమాంధ్ర, తెలంగాణలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను బేరేజు వేసుకుని తమ సర్వే నివేదికలను వరుసగా వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడించిన పలు సంస్థల సర్వేలు టీడీపీ-బీజేపీ కూటమికే పట్టంకట్టిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి