తెలుగు జాతి కోసమే పార్టీ పెట్టా : కిరణ్ కుమార్ రెడ్డి

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (17:12 IST)
File
FILE
తాను తెలుగు ప్రజలు, తెలుగు జాతి శాశ్వతంగా కలిసివుండాలన్న ఉద్దేశ్యంతోనే జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించినట్టు మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతేకానీ పదవుల కోసం పార్టీ పెట్టలేదన్నారు.

ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగుజాతి కలిసుండాలని పోరాటం చేయడం కోసమే ప్రజల ముందుకు వచ్చానని, జేఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పాదరక్షలు గుర్తుకే ఓటు వేయాలని ఆయన అన్నారు. తమ పదవుల కోసం పార్టీ పెట్టలేదని, యువత భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి