తెలంగాణాలో కాంగ్రెస్‌కు 20 నుంచి 30 సీట్లే : కేసీఆర్

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (14:10 IST)
File
FILE
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 30కు మించి సీట్లు రావని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరగదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. కరీంనగర్‌లో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ 186 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిందని ఆయన ఆరోపించారు.

వచ్చే ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టును అధునీకరిస్తామన్నారు. పెగడపల్లిలో మార్కెట్ యార్డు నిర్మిస్తామన్నారు. తెలంగాణలోని వైష్ణవ ఆలయాల్లో ధర్మపురి, యాదగిరిగుట్ట ప్రత్యేకమైనవన్నారు. ఖచ్చితంగా వచ్చే గోదావరి పుష్కరాలు రూ.500 కోట్లు కేటాయిస్తామన్నారు.

ధర్మపురికి వచ్చే భక్తుల కోసం పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. లాఠీలు, తూటాలకు భయపడకుండా పోరాటం చేసి విద్యార్థి సింహం బాల్క సుమన్‌ను పెద్దపెల్లి ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆంధ్రబాబే బాబు ఆంధ్రాకు వెళ్లాల్సిందేనన్నారు. అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలన్నారు.

వెబ్దునియా పై చదవండి