పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ... పూర్తి ప్రచారం కోసం!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (12:39 IST)
FILE
జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడుకు మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. మంగళవారం ఎల్బీ స్టేడియంలో మోడీ బహిరంగ సభలో వీరిద్దరూ ఎడముహం పెడముహంగానే వ్యవహరించారని కథనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ తేనీటి విందుకు ఆహ్వానించినట్లు సమాచారం. పీవీపీకి విజయవాడ టిక్కెట్ ఇవ్వలేదని పవన్ చంద్రబాబుతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారని, అందుకే నిన్న జరిగిన సభలో ఎక్కడా టీడీపీ ప్రస్తావన లేకుండా పవన్ ప్రసంగించారని చెప్పుకుంటున్నారు.

దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టేలా పవన్, బాబుతో సమావేశమయ్యారని సమాచారం. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు పోవాలన్నదానిపై చర్చించనున్నారు. ఇకపై పవన్ టీడీపీకి పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని బాబు అడగనున్నారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి