తెలంగాణాను అడ్డుకున్నది కేసీఆరే : విజయశాంతి ధ్వజం

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (13:04 IST)
File
FILE
గత 2004 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది టీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదని... 2004లో తెలంగాణ ఇద్దామనుకున్న సోనియాను ఆయన అడ్డుకున్నారని ఆరోపించారు.

టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. కొంతమంది ఆయనను గాంధీతో పోలుస్తున్నారని... పొద్దున లేచినప్పటి నుంచి సమైక్యవాదులు, నాయకుల వద్ద డబ్బులు వసూలు చేసే కేసీఆర్‌ను గాంధీతో పోల్చడం మహా పాపమని తెలిపారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన మహాత్ముడు ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? అంటూ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి