ఓట్లు చీల్చరాదనే ఎన్నికల్లో పోటీ చేయలేదు : పవన్ కళ్యాణ్

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (13:19 IST)
File
FILE
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీల్చరాదన్న ఉద్దేశ్యంతోనే పోటీకి దూరంగా ఉన్నానని, కానీ, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసి పోటీ చేస్తామని సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం పవన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు చీల్చకూడదనే భావనతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే మూడు పార్టీలు కలిసి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ పార్టీలు విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అందుకే జనసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి