టైటానియం స్కామ్ : కేవీపీ అరెస్టుకు రంగం సిద్ధం!?

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (16:58 IST)
File
FILE
టైటానియం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ ఆత్మ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అరెస్టుకు రంగం సిద్ధమైందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. రాష్ట్రంలోని టైటానియం ఖనిజాన్ని విదేశీ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిన కుంభకోణంలో కేవీపీ కీలక నిందితుడంటూ అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఓ అంతర్జాతీయ కుంభకోణానికి తమ భూభాగాన్ని వాడుకున్నారన్న ఆరోపణలతో కేవీపీ సహా మరో ఐదు మందిపై షికాగో ఫెడరల్ కోర్టు అభయోగాలు మోపిన విషయం తెల్సిందే. దీంతో కేవీపీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.

ఇదిలావుండగా, అమెరికాకు చెందిన అధికారులు (ఎఫ్‌బీఐ) ఢిల్లీ చేరుకున్నారని... సీబీఐ అధికారులతో చర్చలు జరుపుతున్నారని పీటీఐ తెలిపింది. భారతీయ చట్టాల పరిధిలోనే కేవీపీని అరెస్ట్ చేసే యోచనలో అమెరికా అధికారులు ఉన్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి