నా అక్క శోభానాగిరెడ్డి.. ఆరోగ్యం ఎలావుంది : జగన్

గురువారం, 24 ఏప్రియల్ 2014 (11:44 IST)
File
FILE
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఆళ్లగడ్డ అభ్యర్థి శోభానాగిరెడ్డి తన అక్కలాంటివారని, ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటూ కేర్ ఆస్పత్రి వైద్యులను వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫోనులో సంప్రదించి వాకబు చేశారు.

ఈ ప్రమాదంపై ఆయన స్పందిస్తూ శోభా నాగిరెడ్డి తన అక్కలాంటి వారని, ఆమె అడుగడుగునా తన వెంట నడిచారని, తన నీడలా వెన్నంటి ఉండి పార్టీకి మంచి అండదండలు అందించారని అన్నారు. శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.

ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం విషమ పరిస్థితిలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అందువల్ల తాను ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్తున్నానని గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి