బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు ప్రకటించారు. ఈయన మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.
దీంతో ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం వనస్థలిపురంలోని పనామా జంక్షన్, ఎన్జీవోస్ కాలనీ, బీఎన్ రెడ్డి నగర్, రెడ్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి లోక్సత్తా సంపూర్ణ మద్దతు తెలుపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ లోక్సత్తా అసెంబ్లీ అభ్యర్థి దోసపాటి రాము కూడా పాల్గొన్నారు.