కర్ణాటక ఉప ఎన్నికల ఎఫెక్ట్ : కుమారస్వామి రాజీనామా ఆమోదం!

FILE
కర్ణాటక ఉప ఎన్నికల ఎఫెక్ట్‌తో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జెడి(ఎస్) కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవికి హెచ్‌డి కుమారస్వామి చేసిన రాజీనామాను ఆమోదించనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవే గౌడ తెలిపారు.

బెంగళూరులో దేవెగౌడ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్ష పదవికి కుమారస్వామి రాజీనామా చేసిన నేపథ్యంలో బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో చర్చిస్తామని, గురువారం మరోసారి పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు.

ఆ సమావేశంలో కుమార ప్రతిపక్షనాయకుడిగా కొనసాగాలా.. అవసరం లేదా.. అనే విషయమై చర్చించడంతో పాటు భవిష్యత్‌లో ఎవరు పదవి చేపట్టాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. జెడి(ఎస్) భారీ ఓటమి నేపథ్యంలో పార్టీపై గౌడ మరింత దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

కాగా, కర్ణాటకలోని మాండ్య, బెంగళూరు రూరల్ లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి