ముంబై గ్యాంగ్ రేప్... వేడివేడిగా టీ తాగి తాపీగా మ్యాట్నీ షో చూసి...

సోమవారం, 26 ఆగస్టు 2013 (14:58 IST)
FILE
ముంబైలో మహిళా ఫోటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ వద్ద గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీసు స్టేషనుకు సమీపంలోని ఓ టీ బంకు వద్ద టీ తాగి, తాపీగా మ్యాట్నీ సినిమా కూడా చూశారట.

గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు తమను పట్టుకోలేరనే బలమైన నమ్మకంతో ఉన్న నిందితుడు విజయ్ జాధవ్, ఆ మరుసటి రోజు ఉదయం హ్యాపీగా వేడివేడిగా టీ తాగి దిల్ వాలె దుల్హానియా లేజాయింగే సినిమాకెళ్లాడట.

19 ఏళ్ల జాధవ్ తనతోపాటు గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితుడుగా ఉన్న సలీమ్ అన్సారీని కూడా వెంటబెట్టుకుని సినిమాకెళ్లాడు. సినిమా చూసి హాలు నుంచి బయటకు వస్తుండగా గ్యాంగ్ రేప్ కేసులో ఓ సహచరుడ్ని పోలీసులు పట్టేసినట్లు ఫోన్ కాల్ వచ్చింది.

అంతే ఇద్దరూ తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అన్సారీ ఢిల్లీకి పారిపోగా, జాధవ్ మాత్రం మదన్పుర వీడియో పార్లర్‌లో దాక్కున్నాడు. ఐతే పోలీసులు తమదైన శైలిలో ఇద్దర్నీ పట్టేశారు.

వెబ్దునియా పై చదవండి