మందుపాతర పేలి 13మంది జవాన్లు మృతి: ఇద్దరి పరిస్థితి విషమం

FILE
మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సాలూరు నియోజవర్గం సుంకి సమీపంలోని బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు మంగళవారం ఉదయం మందుపాతర పేల్చారు.

ఈ దుర్ఘటనలో 13మంది బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులు, బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల ఘటనలో మృతి చెందిన వారిలో అత్యధికులు జవాన్లేనని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి