తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటన శిలాశాసనమే : ఏపీఎన్జీవోలతో ప్రధాని

మంగళవారం, 27 ఆగస్టు 2013 (15:51 IST)
FILE
తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం శిలాశాసనమే అన్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏపీఎన్జీవోలతో చెప్పినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఏపీఎన్జీవోలు ప్రధానమంత్రిని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీఎన్జీవోలతోపాటుగా విద్యుత్, ఆర్టీసీ, విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.

కాగా ప్రధానమంత్రి ఏపీఎన్జీవోలు చెప్పిన విషయాలన్నిటినీ సావధానంగా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయం పార్టీపరంగా తీసుకున్నదనీ, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తామేమీ మార్చలేమని చెప్పినట్లు అశోక్ బాబు వెల్లడించారు.

ఐతే రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను ప్రధానమంత్రికి కూలంకషంగా వివరించామనీ, తాము చెప్పినవన్నీ విన్న తర్వాత, ఈ సమస్యలను విన్నవించుకునేందుకు కమిటీ వేస్తున్నామనీ, ఆ కమిటీకి మీ విన్నపాలను తెలుపవచ్చని చెప్పారన్నారు.

వెబ్దునియా పై చదవండి