వాల్మార్ట్ ఇండియా సీఈవోగా క్రిష్: జనవరి 20న బాధ్యతలు!

FILE
వాల్మార్ట్ ఇండియా విభాగానికి క్రిష్ అయ్యర్ ముఖ్యకార్యనిర్వహాణాధికారి(సీఈఓ)గా నియమించారు. ఈ మేరకు యూఎస్లో చిల్లర మార్కెట్ వ్యాపార దిగ్గజం వాల్మార్ట్ యాజమాన్యం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

2014, జనవరి 20న క్రిష్ బాధ్యతలు చేపడతారని తెలిపింది. భారత్లో తమ వ్యాపారాన్ని మరింత పురోగతి సాధించేందుకు క్రిష్ కీలక పాత్ర పోషిస్తారని వాల్మార్ట్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత సీఈఓ రామ్నిక్ నర్సీ స్థానంలో క్రిష్‌ను నియమించినట్లు వాల్ మార్ట్ సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి