ప్రియాంకా గాంధీ పిచ్చితాగుబోతు : సుబ్రమణ్య స్వామి

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (10:24 IST)
File
FILE
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ పిచ్చితాగుబోతని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. అంతేకాకుండా, వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రియాంక పోటీ చేసి ఉంటే చిత్తుచిత్తుగా ఓడిపోయి ఉండేదని జోస్యం చెప్పారు.

బీజేపీ యువనేత వరుణ్ గాంధీ దారితప్పాడంటూ ప్రియాంక చేసిన విమర్శలకు సుబ్రమణ్య స్వామి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు, ఆమె భర్త వధేరాకు ఎంతో చెడ్డపేరుందని ఆయన అన్నారు. వారణాసి నుంచి పోటీకి దిగకుండా ప్రియాంక గాంధీని ఆమె కుటుంబ సభ్యులు కాపాడారని, లేకుంటే ఆమెకున్న చెడ్డ పేరుతో చిత్తుచిత్తుగా ఓడిపోయేదని అన్నారు.

తమ పార్టీ నేత వరుణ్ దారి తప్పలేదని ప్రియాంకే దారి తప్పారంటూ దుయ్యబట్టారు. తండ్రిని చంపిన హంతకులను చూసేందుకు జైలుకు వెళ్లి, తండ్రి పట్ల కృతఘ్నత చాటుకున్న విశ్వాసఘాతకురాలైన కూతురు ప్రియాంక అని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి