నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది: మమత.. ప్రజల కోసం మళ్లీ పుడతా!

శనివారం, 19 ఏప్రియల్ 2014 (10:49 IST)
FILE
తనపై హత్యకు కుట్ర జరుగుతోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ అంటున్నారు. గురువారం ఆమె మల్దాలో బసచేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ ఇది ప్రమాదం కాదని తనపై హత్యకు కుట్ర జరిగుతోందని ఆమె ఆరోపించారు.

గత కొద్ది రోజులుగా ఆమె హత్యకి కుట్ర జరుగుతున్నట్టు కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నట్టు ఆమె అన్నారు. మమత ఉంటోన్న హోటల్ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ హోటల్ గదిలో షార్ట్‌సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని తోసిపుచ్చిన మమత, విషవాయువును వదిలి తనను చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. అయితే తాను చనిపోయినా ప్రజల కోసం మళ్లీ జన్మిస్తానని ఆమె అన్నారు.

వెబ్దునియా పై చదవండి