నడుస్తున్న బస్సులో 14 ఏళ్ల బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (11:26 IST)
FILE
ఉత్తర భారతదేశంలో సామూహిక అత్యాచారాలు ఆగటంలేదు. నిర్భయ చట్టంతో ఉరి శిక్ష అమలులోకి వచ్చినా మృగాళ్లు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ఐదుగురు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

నడుస్తున్న బస్సులోనే ఆ బాలికపై ఈ నలుగురూ సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరుక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవరుతో సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి