సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు వారసులే : సుప్రీంకోర్టు

గురువారం, 24 ఏప్రియల్ 2014 (10:50 IST)
File
FILE
పెళ్లి చేసుకోకుండా, సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేసి, తద్వారా పిల్లలకు జన్మనిస్తే వారు చట్టబద్ధ వారుసులేనని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ న్యాయవాది ఉదయ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ జే చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.

పెళ్లి చేసుకోకపోయినా, భార్యాభర్తలుగా సుదీర్ఘకాలం కలసి జీవించి, పిల్లలను కంటే వారిని వివాహితులుగానే భావించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. వారి సంతానాన్ని అక్రమం అని చెప్పడానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

వెబ్దునియా పై చదవండి