వారణాసిలో కేజ్రీవాల్ నామినేషన్ ... ఆస్తి రూ.2.14 కోట్లు!!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (09:11 IST)
File
FILE
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వారణాసి లోక్‌సభలో నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాల్లో తాను, తన భార్య పేరిట ఉన్న చర, స్థిరాస్తుల విలువ రూ.2.14 కోట్లు అని పేర్కొన్నారు.

తాను సామాన్యుడినని, తన జేబులో రూ.500 మాత్రమే ఉన్నాయని చెప్పుకునే కేజ్రీవాల్... నామినేషన్ వేసేందుకు తాను డొక్కు జీపులో వెళుతున్నానని ప్రకటించారు. అయితే, ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్‌లో తెలిపిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోక తప్పదు.

కేజ్రీవాల్ పేరిట భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాలో రూ.4 లక్షల నగదు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే తన భార్య సునీత వద్ద రూ.17 లక్షలకు పైగా చరాస్తి ఉందని ఆయన తెలిపారు. రూ.90 లక్షల విలువైన స్థిరాస్తి తన పేరిట ఉండగా, సునీత పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.కోటికి పైగా ఉంటుందని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి