ఇంద్రకీలాద్రిపై శరన్నవాత్రి ఉత్సవాలు ప్రారంభం..!

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వర్ణకవచాలంకృత కనదుర్గమ్మదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

శనివారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. సీపీ శ్రీనివాసులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శనివారం ప్రారంభమయిన కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు.. తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. కాగా శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోనుంది.

వెబ్దునియా పై చదవండి