తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత పరమ ప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూ తయారీలో మరింత నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం.జి.గోపాల్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. నాణ్యత పెంచే చర్యల్లో భాగంగా లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతను మరింత పెంచుతామని చెప్పారు. ఈ మేరకు బాలాజీ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
టీటీడీ టెండర్ విధానంలో దశల వారీగా పాదర్శకతను అమలు చేస్తామన్నారు. దానికోసం కూడా మార్పులు చేర్పులు చేపట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు గోపాల్ వివరించారు.
లడ్డూ తయారీలో నాణ్యత లోపించిందంటూ ఇటీవలి కాలంలో అనేక విమర్శలు, వివాదాలు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఈవో గురువారం స్వయంగా వివరణ ఇచ్చారు.