ఆ ఓటమి ఇంకా వెంటాడుతూనే ఉంది: యువరాజ్ సింగ్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (10:11 IST)
FILE
శ్రీలంకతో టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓటమి తననింకా వెంటాడుతూనే ఉందంటున్నాడు టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్. అయితే దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు అజేయంగా కొనసాగిన భారత జట్టు తుదిమెట్టుపై లంక చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

ఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడూ మరిచిపోలేని, మరిచిపోదగిన జ్ఞాపకాలను మిగుల్చుతాయి. అయితే క్రీడాకారులు ఇలాంటి భావోద్వేగాల నుంచి బయపడి, కొత్త సవాళ్లకు సిద్ధమవ్వాలి అని యువీ అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో జట్టుగా మేం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో మాత్రం పరిస్థితులు అనుకూలించలేదు.

ఆ అసంతప్తి నుంచి కోలుకోవడం అంత ఈజీకాదు. సక్సెస్‌ను, వైఫల్యాలను ఒకేలా స్వీకరించాలని చిన్నప్పుడు కోచ్ చెప్పేవారు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నా అని యువీ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ తమకు చిరస్మరణీయంగా మిగిలిపోవాలని ఆశిస్తున్నానని యువీ అన్నాడు.

వెబ్దునియా పై చదవండి